- Advertisement -
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్సై..!
బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు..!
నాగర్ కర్నూల్
SI caught red-handed by ACB officials while accepting a bribe!
People celebrate by bursting firecrackers!
తిమ్మాజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి ఎస్సై హరిప్రసాద్ రెడ్డి లంచం డిమాండ్ చేసాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని పట్టుకున్నాడు. దీంతో అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
- Advertisement -



