- Advertisement -

దుకాణాలు దగ్దం..ఆదుకుంటానన్న ఎమ్మెల్యే రాచమల్లు
ప్రోద్దుటూరు
బుధవారం రాత్రి ప్రొద్దుటూరు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వద్ద ఉన్న మూడు షాపులు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్కడికి వెళ్లి కాలిపోయిన షాపులను పరిశీలించారు. నష్టాన్ని మొత్తం తానే ఇస్తానని కాలిపోయిన షాపుల యజమానులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, ఆ వార్డు కౌన్సిలర్ నూక నాగేంద్ర రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకుడు కోటవీధి రమేష్, మరికొందరు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు..
- Advertisement -



