- Advertisement -
తాడేపల్లిగూడెంలో ఐదు రూపాయలకే బిర్యానీ…
Biryani for five rupees in Tadepalligudem...ఫ్రెండ్స్ దాబా ప్రారంభోత్సవ ఆఫర్..
తాడేపల్లిగూడెం,
పాత నోట్లకి బిర్యానీ ఆఫర్ ట్రేండింగ్ గా మారుతుంది. తాడేపల్లిగూడెంలో ఫ్రెండ్స్ దాబా రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐదు రూపాయలకే బిర్యానీ ఆఫర్ తో స్థానికులు ఎగబడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ వలవల బాబ్జి సమక్షంలో సుమారు 500 మందికి ఐదు రూపాయల నోటికి బిర్యానీ అందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జి మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించే విధంగా యువత ప్రారంభించిన ఫ్రెండ్స్ దాబా రెస్టారెంట్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ దాబా నిర్వాహకులు ఎన్ వినయ్ సాయి దుర్గ ప్రసాద్ ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ ప్రారంభించారు.
- Advertisement -




