Saturday, February 14, 2026

కవిత చేతికి పార్టీ పగ్గాలు…

- Advertisement -

కవిత చేతికి పార్టీ పగ్గాలు…

Party reins in Kavitha's hand...

హైదరాబాద్, డిసెంబర్ 5, (వాయిస్ టుడే)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన ప్రకారమే అంతా జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.అధికారం పోయిన తర్వాత కారులో భారీగా కుదుపులు మొదలయ్యాయి. ఓ వైపు నేతలు వలసలు.. మరోవైపు లీడర్ షిప్ కోసం ఎత్తుకు పైఎత్తులు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్‌ని ఎదుర్కోవాలంటే కేటీఆర్ బెటరని భావించారు పెద్దాయనకేటీఆర్ రంగంలోకి దిగేశారు.. ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూపించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు వచ్చినట్టు ప్రచారం సాగింది. అదే క్రమంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకోవడం, ఆపై కేసు నమోదు కావడం జరిగిపోయింది.ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు లోతుగా జరుగుతోంది. రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం సాగింది. ఒకవేళ కేటీఆర్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడ్డారట. హరీష్‌రావుకి పగ్గాలు అప్పగించేందుకు కేటీఆర్, కవిత మొగ్గు చూలేదని గుసగుసలు.పార్టీ పగ్గాలు కొద్దిరోజులపాటు కవితకు ఇస్తే బెటరని కేటీఆర్, కేసీఆర్ చర్చించుకున్నా రట. ఆ తర్వాత ఆమె పేరు తెరపైకి రావడం, ఆపై తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి. ఐదురోజులపాటు ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు కవిత. పార్టీలో జరుగుతున్న పరిణామాలను హరీష్‌రావు వర్గీయులు గమనిస్తున్నారు. అయితే మంగళవారం చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్‌రావుపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో కవితమ్మకు లైన్ క్లియర్ అయ్యింది.ఈ క్రమంలో కేసీఆర్ తన కూతురుకు కొన్ని సలహాలు, సూచనలు చేశారట. దాని ప్రకారమే అడుగులు వేస్తోందామె. రేవంత్ సర్కార్ ఏడాది సందర్భంగా బీఆర్ఎస్‌లో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా ఏడాదిపాటు పార్టీని నడిపించిన కేటీఆర్..  ఇప్పుడు దూరంగా ఉన్నారు.పార్టీ పగ్గాలు కవిత చేతికి వచ్చాయి. ఈమె కూడా ఏడాది పాటు కొనసాగుతారా? మధ్యలో మళ్లీ ఏమైనా మార్పులు జరుగుతాయా? అన్న ప్రశ్నలు గులాబీ శ్రేణుల్లో మొదలైపోయింది. పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై గులాబీ నేతలు గమనిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్