- Advertisement -
తులం బంగారం ఎప్పుడు ఇస్తారు…
When will Tulam Gold be given...
మాజీమంత్రి తలసాని
హైదరాబాద్
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పంపిణీ చేసారు. తలసాని మాట్లాడుతూ తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రకటించారు. ఏడాది దాటినా తులం బంగారం ఇవ్వని ప్రభుత్వం ఇదని అన్నారు. ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారుల తరపున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను తలసాని ఆదేశించారు.
- Advertisement -



