ఈరోజుతో ముగియనున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు

- Advertisement -

ఈరోజుతో ముగియనున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు

Members of the Municipal Council which will end today

కొందరు మంచివారికి మాత్రమే వీడ్కోలు అభినందనలు చెప్తున్నాము.
అవినీతిపరులకు రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము
అఖిలపక్ష ఐక్యవేదిక
వనపర్తి

ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనీ అబాసు పాలు అయింది. ఒకడు  చెరువు కట్ట తవ్వితే, మరొకడు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటాడు, ఒకడు మట్టి, అక్రమ ఇసుక అమ్ముతే, మరొకడు మున్సిపల్ పార్కులు, పాత ఆస్తులను అమ్ముకుంటాడు, ఒకడు ప్రజలు కట్టిన టాక్సీ సొమ్మును మింగితే, మరొకడు మున్సిపల్ కాంట్రాక్ట్ లేబర్ లతో కమీషన్లు మింగుతాడు, ఒకడు చెట్లు కొట్టి అమ్ముకుంటే, మరొకడు అక్రమ పర్మిషన్లు ఇప్పించి దండుకున్నారు. ఇలా మున్సిపాలిటీలో 8 మంది అత్యంత అవినీతిపరులుగా, మరొక ఎనిమిది మంది వారికి సహాయకులుగా ఉన్నారు. మిగతావారు కొద్దిమంది మంచిగా సేవ చేశారు, కొద్ది మంది చేతకాక ఊరుకున్నారు. మంచివారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము, వారిని మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలకు పిలిపిస్తున్నాము.
పలుమార్లు మేము చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఈరోజు పత్రికా ముఖంగా చెప్తున్నాను. మా ఆరోపణ తప్పు అని అనుకున్న వారితో రాజీవ్ చౌక్ లో మేధావులచే టెంట్ వేయించి చర్చకు సిద్ధంగా ఉంటాము.అఖిలపక్ష ఐక్యవేదిక
అధ్యక్షుడు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, కొత్తగొళ్ల శంకర్, రాజునగరం రవి, శరత్ చంద్ర, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రిక విలేకరుల సమావేశం లో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular