దళితులకు న్యాయం చేస్తాం–జిల్లా కలెక్టర్ శ్రీధర్

- Advertisement -

దళితులకు న్యాయం చేస్తాం–జిల్లా కలెక్టర్ శ్రీధర్

We will do justice to Dalits--District Collector Sridhar

బద్వేలు

బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం చెన్నుపల్లి దళితులకు చెందిన భూములను సబ్ డివిజన్ జరిపించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్   నేషనల్ హ్యూమన్ రైట్స్  అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు. ఫిర్యాదు చేయడం జరిగినది. కలసపాడు మండలం చెన్నుపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్లు 271 272 273 274.275.276 లో 20 14 వ సంవత్సరంలో అప్పటి కలెక్టర్ వారు పేదలైన వారిని గుర్తించి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డి పట్టాలు పాస్బుక్కులు మంజూరు చేయడం జరిగినది. అప్పటినుంచి ఇప్పటివరకు సబ్ డివిజన్ కొరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దళితులను చిన్నచూపు చూడటం సరైనది కాదని చాలా కాలం నుంచి సబ్ డివిజన్ కొరకు ఆఫీసు చుట్టూ తిరుగుతున్న మాకు న్యాయం జరగడం లేదని ఈరోజు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ గారికి వారి బాధను వ్యక్తపరచడం జరిగినది వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్డీవో. కలసపాడు తాసిల్దార్ జిల్లా సర్వే తో మాట్లాడి వెంటనే సబ్ డివిజన్ చేయిస్తామని దళితులకు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ రావు మరియు దళితులు పాల్గన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular