మందు ముట్టుకుంటే షాక్

- Advertisement -

మందు ముట్టుకుంటే షాక్

Shock if you touch the drug

నిజామాబాద్,  ఫిబ్రవరి 1, (వాయిస్ టుడే)
మద్యం ప్రియులకు కిక్కు దించే సమాచారం వస్తోంది. మద్యం ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి.. ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. మద్యం ప్రియులకు కిక్కు దించే సమాచారం వస్తోంది. మద్యం ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి.. ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంతెలంగాణ సచివాలయంలో ఇటీవల ఎక్సైజ్ అధికారులు సమావేశమై ధరల పెంపు అంశంపై చర్చించారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది.తెలంగాణ సచివాలయంలో ఇటీవల ఎక్సైజ్ అధికారులు సమావేశమై ధరల పెంపు అంశంపై చర్చించారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15 శాతం వరకు మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. నిరుపేదలు ఎక్కువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15 శాతం వరకు మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. నిరుపేదలు ఎక్కువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.పంచాయతీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా పాత రేట్లతోనే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం తయారీ, సరఫరా చేస్తున్న కంపెనీలు.. లిక్కర్ రేట్లపై చాలా అసంతృప్తిగా ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీర్ల రేట్లు పెంచాలని కంపెనీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఓ కంపెనీ బీర్ల సరఫరా ఆపేస్తున్నామని లేఖ రాసింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై కదలిక వచ్చింది కంపెనీలు లేఖలు రాయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో అవి దిగిరాక తప్పలేదు. ఇటు మద్యం ధరల పెంపు అంశంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ సూచనల మేరకు ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular