రాకీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం
Union Minister Rammohan Naidu with Rocky
విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సుడి గాలి పర్యటనలు చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. విశాఖ లో ఫ్లీట్ రివ్యూ కార్యక్రమా న్ని ముగించుకుని డిల్లీ పయనం అయ్యారు. ఇదే సంధర్భంలో విశా ఖ విమానాశ్రయంకు చేరుకున్నా రు. వి.ఐ.పి లాంజ్ నుండి బయ టకు వస్తున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసు జాగి లం రాకీ.. రామ్మోహన్ నాయుడు కంట పడింది. స్వతహాగా పెంపు డు జంతువులు, సాధు జంతువు లు అంటే అమితమైన ప్రేమ కలి గిన రామ్మోహన్ నాయుడు.. రాకీ ను చూడగానే దగ్గరికి చేరిపోయా రు. రాకీ ను మచ్చిక చేసుకుని కరచాలనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా అక్కడున్నవారితో పోలీసు జాగిలాల ప్రత్యేకతను వివరించారు. ఈ రోజు దేశంలో అనేక విమానాశ్రయాలలో భద్రత విషయంలో పోలీసు జాగిలాల పాత్ర ప్రత్యేకమైనదనీ అన్నారు. విశ్వాసం, విధేయతకు అవి కట్టు బడి ఉంటాయని తెలిపారు.



