కొనసాగుతోన్న మోయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణ
రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు
హైదరాబాద్
Moinabad Drugs Case Investigation Continues
Police Question Rohit Reddy
మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సిట్ విచారించింది. రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ డ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి,ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను చంచల్ గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గం టల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు లాయర్ల సమక్షంలోనే ముగ్గురినీ విచారించారు. మొదట రోహిత్ రెడ్డితో ప్రారంభించి,ముగ్గురిని సిట్ బృందం ఆధ్వర్యం లో వేర్వేరుగా విచారించారు. డ్రగ్స్ కొనుగోలు,కాల్పుల వ్యవహారం తదితర అంశాలపై సిట్ అధికారుల బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వీరందరిని ఫామ్ హౌస్ తీసుకెల్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం…



