- Advertisement -
విజయవాడ…: సినీ నటి హన్సిక ఇంద్రకీలాద్రి అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇప్పించి, అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందజేసారు.
హన్సిక మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మై నేమ్ ఇస్ శృతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చాను. నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్ గా నా చిత్రం రిలీజ్ కానుంది. ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.

- Advertisement -



