Sunday, September 8, 2024

బీజేపీకి అధికారమిస్తే మీ అందరి జీవితాలు మారుస్తాం బండి సంజయ్

- Advertisement -

బీజేపీకి అధికారమిస్తే మీ అందరి జీవితాలు మారుస్తాం
—2సార్లు ఓడిపోయా… ఈసారైనా గెలిపించండి
—కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి

కరీంనగర్, నవంబర్ 09 (వాయిస్ టుడే): ఎంపీగా గెలిపిస్తే బండి సంజయ్ కరీంనగర్ కు చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నీ కేంద్రానివేనని స్పష్టం చేశారు. ‘‘స్మార్ట్ సిటీ నిధులు తెచ్చిన. ఆర్వోబీ నిధులు తెచ్చిన. రోడ్లకు నిధులు తెచ్చిన. అంతెందుకు డ్రైనేజీ, టాయిలెట్లుసహా కరీంనగర్ లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది’’అని చెప్పారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ కు సవాల్ చేశారు. ‘‘కమలాకర్… డేట్, టైం ఫిక్స్ చేయ్. అకౌంట్స్ తీసుకుని రా… నేను ఎంపీగా గెలిచాక కరీంనగర్ అభివ్రుద్ధికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కలతో సహా వస్తా. చర్చిద్దాం. సిద్ధమా?’’ అంటూ సవాల్ విసిరారు. తాను కేంద్రం నుండి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే…. అన్నీ తానే చేసినట్లుగా గంగుల కమలాకర్ చెప్పుకోవడం సిగ్గు చేటు.’’అని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ సప్తగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ లో గాజా రమేశ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. నేను ఎంపీగా ఎన్నికైనంక 8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా. వీధి దీపాలు, డ్రైనేజీసహా కరీంనగర్ లో జరుగుతున్న అభివ్రుద్ది నిధులన్నీ కేంద్రానివే. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిధులు కేంద్రానివే. స్మార్ట్ సిటీ నిధులన్నీ కేంద్రానివే. సర్కస్ గ్రౌండ్, ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ అభివ్రుద్ధికి నేను నిధులు తెచ్చా. రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు కేంద్రమే ఇస్తోంది. జాతీయ రహదారుల విస్తరణ నిధులు కేంద్రానివే. చివరికి వైకుంఠ ధామాల నిధులు కేంద్రానివే. నిధులు నేను తీసుకొస్తే కొబ్బరికాయ మాత్రం బీఆర్ఎస్ నేతలు కొట్టి తామే నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు. అంతేగాకుండా ఎంపీగా నన్ను గెలిపిస్తే ఎన్నడూ ఖాళీగా లేను. మీ కోసం పోరాటం చేసిన. నాపై ఏకంగా 74 కేసులు పెట్టారు. నా ఆస్తికోసమో, కుటుంబం కోసమే కొట్లాడలే. పేదల కోసం కొట్లాడిన. నిరుద్యోగ యువత కోసం కొట్లాడితే కేసులు పెట్టిండు. రైతుల పక్షాన ఉద్యమిస్తే కేసులు పెట్టిండు. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ఎవరైనా కొట్లాడుతున్నారా?బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపిస్తే… అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుంటున్నారు. పేదల భూములను లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ లో రౌడీయిజం, గూండాగిరి ఎక్కువైంది. పేదలపై దాడులు చేస్తున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తా. పేదల జోలికి వచ్చే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉరికించి కొడతాం. బండి సంజయ్ ది మచ్చలేని జీవితం. నేను ఏనాడైనా కబ్జాలు చేశానా? ఎన్నడైనా కమీషన్లు తీసుకున్ననా? ఎన్నడైనా తప్పుడు పనులు చేశానా? మీ తీర్పు కోసం 50 లక్షల మంది నిరుద్యోగులు చూస్తున్నరు. 40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నరు. లక్షలాది మంది ఉద్యోగులు చూస్తున్నరు. లక్షల మంది విద్యార్థులు చూస్తున్నరు. వాళ్ల గొంతుకనైన నన్ను గెలిపించండి. బీజేపీకి అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా. పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం అని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్