Friday, February 7, 2025

కులగణన సర్వే తప్పుడు తడకలు కాకి లెక్కలు

- Advertisement -

కులగణన సర్వే తప్పుడు తడకలు కాకి లెక్కలు

Census Survey is a miscalculation

ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ లు కల్పించాలి
బోయినిపల్లి మండల మాజీ  కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ

చొప్పదండి ని.వ.

రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పుల తడకగా,
కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని, రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినిపల్లి మండల బిఆర్ఎస్ నాయకుడు,మాజీ  కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ అన్నారు.
కులగణన సర్వే పై బుధవారం మండల మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని బోయినిపల్లి మండల మాజీ  కో-ఆఫ్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,
అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని  ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలిఆమోదించడం,చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని అయిన మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతోతేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని అన్నారు.
బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ్,ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో  చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని,ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని,కేబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.
అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని అయన స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్