- Advertisement -

నంద్యాల జిల్లా:నవంబర్ 11: నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని పాలధార పంచదారగుట్ట వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది . . ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు రాత్రి వేళలో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్థానికులకు కంటపడింది. చిరుతపులి. మృతి చెందిన సంఘటన తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సున్నిపెంట రేంజ్ ఆఫీసర్ నర్సింహులు. పోస్టుమార్టం నిమిత్తం చిరుతపులిని సున్నిపెంటకు అటవీశాఖ అధికారులు తరలించారు. .చనిపోయిన చిరుత పులి ఆరు నెలల చిరుత గా గుర్తించిన అటవీశాఖ అధికారులు..
- Advertisement -



