తన ఇల్లు, వాహనం, సర్వం త్రివర్ణ మయం..
కమాన్ పూర్: తాను, తన మనస్సు, ఇల్లు, వాహనం త్రివర్ణ మయమవుతున్న రామగిరి మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ (దుద్దీళ్ల శ్రీధర్ బాబు ) వీరాభిమాని మసుక్ రబ్బాని , పారిశ్రామిక ప్రాంతమైన యైటింక్లయిన్ కాలనీలోని రామగిరి మండలం, వెంకట్రావు పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని కేకే నగర్ లో సామాన్య కుటుంబానికి చెందిన రబ్బని చిన్న పాటి చికెన్ సెంటర్ ను నాదుపుకుంటూ తన భార్య, పిల్లలు పోషించుకుంటున్నాడు. ఆయన మొదట నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తిరుగుతూ ప్రస్తుతం రామగిరి మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని, శ్రీధర్ బాబును గాని ఎవరైనా విమర్శిస్తే అతనే సహించకపోవడం కొసమెరుపు. ఎన్నికలు రాగానే తన ఇంటిని, తన ద్విచక్ర వాహనాన్ని తన స్వంత డబ్బులతో ఆయిల్ పెయింట్ తో త్రివర్ణంగా జెండా రూపంలో తానే స్వయంగా తయారు చేసుకొని వాహనానికి ఒక పెద్ద కాంగ్రెస్ జెండా కట్టుకుని నియోజకవర్గమంత
తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్. తో ఇతర పార్టీల పొత్తు కుదిరితే పొత్తున్న పార్టీల జెండాలు అన్ని కలిపి వాహనానికి కట్టుకుని ప్రచారం నిర్వహిస్తాడు.. ఇతని ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఇంత కష్టపడి స్వంత ఖర్చులతో ఇల్లు, వాహనం, |త్రివర్ణకారం చేసి వాహనంలో పెట్రోల్ పోసుకుని నియోజకవర్గం అంత ప్రచారం చేసి చిన్న పాటి చికెన్ | వ్యాపారి మాసూక్ రబ్బాని కి కాంగ్రెస్ అదిష్టనం అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. మంథనిలో శ్రీధర్ బాబును గెలిపించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు.




