- Advertisement -
ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తేనే పంటలు దిగుబడి..
మండల వ్యవసాయ అధికారి ని. నీలవేణి..
డుంబ్రిగూడ
Crops yield only if modern methods are used.
రైతులు ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తేనే పంటలలో అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారిని నీలవేణి అన్నారు. మండలంలోని అరకు సంత బయలు గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆధునిక యంత్రాలతో ఉపయోగించే పంటలు పండించాలని చెప్పారు. అలాగే రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




