Sunday, September 8, 2024

కాంగ్రెస్ నేత ఇళ్లకు కరెంట్ ఆపాలి

- Advertisement -

ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్: రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎలెక్షన్. రైతన్నలకు రైతుబంధు మాత్రమే ఆపలా? పేదింటికి రేషన్ బియ్యం, ముసలవ్వలకు ఆసరా పెన్షన్, అక్కలకు బీడీ పెన్షన్, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు, ఇండ్లకి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, షాదీ శాధి ముబరక్ , కళ్యాణ లక్ష్మి ఇలా అన్ని ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపే కుట్రను కూడా చేస్తుందా రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి  కాంగ్రెస్ తెరలేపింది. బిఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాదించింది .. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటది. బెంగుళూర్ ని ఐటి లో క్రాస్ చేశాము .. ఐటి హబ్ లు వచ్చాయి .. ఇండస్ట్రియల్ జోన్స్ కూడా వస్తాయి. తెలంగాణ ను పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే వాళ్ళ అభద్రతా భావం కనిస్పిస్తుంది. సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫీసర్లను మార్చాలని ,  రైతు బందు , దళిత బందు ఆపాలని కాంగ్రెస్ అంటుంది.
ఆలా అయితే కాంగ్రెస్ వాళ్ల ఇళ్లకు కరెంట్ ఆపాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది కదా. బిజెపి లాగ పేర్లు మార్చి పథకాలు పెట్టడం లేదు. యూపిఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ అనే కాంగ్రెస్ హామీ .. ఎన్నికల హామీ మాత్రమే . కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ల్లో ఎందుకు అమలు చేయడం లేదు. గాంధీ లకే గ్యారంటీ లేదు .. అధ్యక్షుడు లేకుండా హామీ ఇస్తారు ..అవి ఎలా నమ్మాలని ఆమె అన్నారు.
బిసిలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 2010 లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బి సి లను చేర్చకుండా బిసిలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ.
అరవింద్ ను కోరుట్ల లో ఓడిస్తాం . రేవంత్ కామారెడ్డికి వచ్చిన , ఈటెల గజ్వెల్ లో పోటీ చేసిన  మా పార్టీకి వచ్చిన నష్టం లేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్