అతిపెద్ద దొంగ జగన్ మోహన్ రెడ్డి

- Advertisement -

అతిపెద్ద దొంగ జగన్ మోహన్ రెడ్డి

Jagan Mohan Reddy is the biggest thief

ఆనం వెంకటరమణా రెడ్డి
నెల్లూరు
భారతదేశంలోనే అతిపెద్ద గజదొంగ జగన్ రెడ్డి అని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ  ఏజెన్సీ చెప్పింది. ఏకంగా రూ.1750 కోట్ల లంచాలు డైరెక్ట్ గా జగన్ రెడ్డి తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎఫ్బీఐ  చెప్పిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు.
తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవాలని సెసి జూన్ 2020లో రాష్ట్రాలతో అగ్రిమెంట్ చేసుకుంది. 18 నెలలు దాటినా, ఏ ఒక్క రాష్ట్రం కూడా విద్యుత్ కొనడానికి ముందుకు రాలేదు. అంత ఎక్కువ ధరకు విద్యుత్ కొనలేం, మాకు మీ కరెంటు వద్దు అంటూ అన్ని రాష్ట్రాలు దండం పెట్టాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, మేము కొంటాం అంటూ ముందుకు వచ్చింది. అన్ని రాష్ట్రాలు వద్దు అంటుంటే, జగన్ రెడ్డి మాత్రం మాకు కావాలి అంటూ ఎక్కువ ధరకు విద్యుత్ కొనడానికి ఒప్పుకున్నాడు. ఇది చెప్పింది మేము కాదు, అమెరికా కోర్టని అయన అన్నారు.
జగన్ రెడ్డి ఇక్కడ సిబిఐ కేసులు లాగా పదేళ్ళు, 20 ఏళ్ళు సాగుతాయి అనుకుంటున్నావ్ ఏమో.. అమెరికా కోర్టులు ఏడాది లోపే తేల్చేస్తాయి.  జగన్ రెడ్డి, అమెరికా జైల్లో బ్రెడ్డు, జాం మాత్రమే పెడతారు. ఇంటి నుంచి చేపల పులుసు, మటన్ బిర్యానీ తెచ్చుకునే వీలులేదని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular