Thursday, March 20, 2025

మద్యం షాపుల నోటిఫికేషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్ 

- Advertisement -

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్ 

Latest Update on Liquor Shops Notification

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది.

మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. అయితే తాజాగా వైసీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదించింది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును ఆమోదించనున్నారు గవర్నర్.

ఇక ఏపీలో మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం..

ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో..

ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది. ఆయా వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ..

కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది.

మరోవైపు ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం తీసుకురానున్నారు.

ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తామని తెలిపింది.

వారికి 10 శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ఇటీవల మంత్రిమండలి నిర్ణయించింది.

సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్