Sunday, February 9, 2025

రీజనల్ రింగ్ రోడ్డుకు మహర్ధశ

- Advertisement -

రీజనల్ రింగ్ రోడ్డుకు మహర్ధశ

Mahardasha to Regional Ring Road

హైదరాబాద్, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు సూపర్ గేమ్ ఛేంజర్ అని ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సుమారు 40 కి.మీ దూరం నుంచి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఉత్తర, దక్షిణ భాగాలుగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తయింది.తెలంగాణ మణిహారంగా చేపడుతున్న రీజిన‌ల్ రింగు రోడ్డుపై కీలక అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గడ్కరీతో స‌మావేశ‌మైన సీఎం రాష్ట్రానికి సంబంధించి పలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల వివరాలను తెలియజేసి సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కోరారు.2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 AA జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేక‌రించింద‌ని చెప్పారు. మిగిలినవి కూడా పూర్తి చేస్తామమని త్వరతిగతిన పనులు ప్రారంభించేందుకు ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.ఇక ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీ‌శైలంను హైదరాబాద్ నగరంతో అనుసంధానించే NH-765లో 125 కిలోమీట‌ర్ల దూరం జాతీయ ర‌హ‌దారుల ప్రమాణాలతో ఉంద‌ని, మిగిలిన 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ అట‌వీ ప్రాంతంలో ఉంద‌ని చెప్పారు. ఆ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల‌ని, అందుకు 2024-25 బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైద‌రాబాద్ ఏపీలోని ప్రకాశం జిల్లా మ‌ధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య న‌గ‌రాలైన‌ హైదరాబాద్-విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వ‌రుస‌లుగా విస్తరించే ప‌నుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాల‌ని కోరారు.పర్వత్ మాల ప్రాజెక్ట్‌లో యాదగిరి గుట్ట దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాల‌న్నారు. న‌ల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు ఎంపీలు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్