- Advertisement -
ఎకో టూరిజం అభివృద్ధిపై దృఫ్టి
Perspectives on Eco Tourism Development
హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే)
గాణ రాష్ట్రాన్ని ఎకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు త్వరలో విధి విధానాలు తయారు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు లోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్పీరియం థీమ్ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు పాల్గొన్నారు.ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో, ప్రొద్దుటూరులో 25వేల జాతుల మొక్కలు వృక్షాలతో థీమ్ పార్క్ ను 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కొద్ది రోజుల్లోనే టూరిజం పాలసీ విధానంలో భాగంగా ఎకో టూరిజం ను విస్తరించేందుకు తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సాధారణంగా ఇంటి పరిసరాల మొక్కలు కొనుగోలు చేసేందుకు గోదావరి జిల్లాలకు వెళుతుంటారని, ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటుచేసిన థీమ్ పార్క్ ఎన్నో అరుదైన మొక్కలను ప్రజలకు చేరువ చేసిందన్నారు.గత ప్రభుత్వ హయాంలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. వికారాబాద్ మరింత అభివృద్ధి పథంలో నడుస్తుందని, దావోస్ పర్యటనలో పెట్టుబడులను సాధించినట్లు సీఎం అన్నారు. ఆ పెట్టుబడుల రాకతో వికారాబాద్ ముఖచిత్రం పూర్తిస్థాయిలో మారుతుందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామయ్య అనే రైతు మొక్కలను పరిరక్షించి పద్మశ్రీ అవార్డు అందుకోవడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు.రాబోయే రోజుల్లో కోటి మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు, అందుకు రైతులు పెంచిన మొక్కలను తగిన రుసుము చెల్లించి తీసుకునే అవకాశం పై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని, అందుకు ప్రతి విద్యార్థి సహకరించాలన్నారు. తల్లి పేరు మీద ప్రతి విద్యార్థి మొక్క నాటాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ కష్టపడుతున్నారు
తెలంగాణను ఎకో టూరిజం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు లోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్ పీరియం థీమ్ పార్క్ ను నేడు ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు.”ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో, ప్రొద్దుటూరులో 25వేల జాతుల మొక్కలు వృక్షాలతో థీమ్ పార్క్ ను 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ” ఎక్స్ పీరియం పార్కు లోని ప్రతి కార్నర్, ప్రతి వృక్షం చూసి సీఎం గారు ఎంత ముచ్చట పడిపోతున్నారు అంటే అంతా ఇంతా కాదు. ఇది ఎలా చేశారు.. అది ఎలా చేశారు అని అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. ఇది షూటింగ్ కు ఇస్తారా రామ్ దేవ్ అని అడిగితే.. ఇస్తానండీ.. కానీ, ఫస్ట్ షూటింగ్ మీదైతేనే ఇస్తాను అని అన్నాడు. ఆ మాట అన్నారు కదా అని కొత్తగా హీరోయిన్ ను తీసుకొచ్చి ఈ ఎండలో స్టెప్స్ వేయమంటే మాత్రం కష్టం. చలికాలంలో అయితే చేస్తాను అని చెప్పాను.అందుకు ఆయన.. ఈలోపు వర్షాలు పడి ఇంకా పచ్చగా ఉంటాయి.. రెండేళ్లలో ఇదంతా అద్భుతంగా ఉంటుంది.. కంటికి కనువిందుగా ఉంటుంది అని ఆయన చెప్తుంటే నేను ఊహించుకున్నాను.. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు.. రిసెప్షన్స్ పెట్టుకోవచ్చు.. ఈవెంట్స్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు స్కెటింగ్ లాంటివి పెట్టాలనే ప్లాన్స్ ఉన్నాయి.అవన్నీరామ్ దేవ్ చేయగలడు. దానికి ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని ప్రోగ్రామ్స్ ను పక్కన పెట్టి.. నిన్నటివరకు వేరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రామ్ దేవ్ మీద, ఈ ప్లేస్ మీద ఎంత నాప్రేమ లేకపోతే ఆయన ఇలా చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే..వాల్తేరు వీరయ్య సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం విశ్వంభర. బింబిసార సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మొట్ట మొదటి సారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
- Advertisement -