- Advertisement -
నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా
Rythu Mahadharna under the leadership of BRS in Nalgonda
కాంగ్రెస్ హయాంలో ఎక్కువైన రైతు కష్టాలు
నల్గోండ
నల్గోండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది.
ఈ మహాధర్నాకు ముఖ్య అతిధిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించారుఏ. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు రైతులు తీసుకెళ్లారు.
కేటీఆర్ మాట్లాడుతూ నల్లగొండ పోరాటాల గడ్డ. పోరాటానికి స్పూర్తి ఇచ్చిన ఈ ప్రాంతానికి వందనం. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా వసతులుండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ఎక్కువయ్యాయి. పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలి. కేసీఆర్ పాలనలో టింగ్ టింగ్ మని డబ్బులు ఖాతాలో పడేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు.. కానీ రేవంత్రెడ్డి మూడో పంటకు ఇస్తా అని మోసం చేస్తున్నాడు. జనవరి 26న రాత్రి 12 గంటలకు డబ్బులు వేస్తామని అన్నడు రేవంత్ రెడ్డి.. కానీ ఇప్పటివరకు రూపాయి పడలేదు. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ అన్నీ బోగస్ అని పేర్కొన్నారు. నల్లగొండ బిడ్డలు జీవశ్చవాలుగా మారడానికి కాంగ్రెస్సే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు రైతు భరోసా 2,500 బాకీ పెట్టిందని, వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 బాకీ పడ్డది. ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17,500 బాకీ ఉన్నది. కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేసింది. రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు. మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదు. నల్లగొండ నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం ప్రారంభం. కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారు. నిలదీయండి. నల్లగొండ నుండే కాంగ్రెస్ను చీల్చి చెండాడాలి. హైకోర్టు ధర్నాకు అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు. మా పోరాటం న్యాయంగా కొనసాగుతుంది. న్యాయం ఇంకా బ్రతికే ఉందని అన్నారు.
- Advertisement -