Sunday, September 8, 2024

సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..

- Advertisement -

నవంబర్ 12న ఉదయం ఏడు గంటలకే మొదటి షో

యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ లేటెస్ట్ చిత్రం ‘టైగర్ 3’ దీపావళి పండుగ సీజన్‌లో సందడి చేయడానికి రెడీగా ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ జంటగా నటించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 12 అంటే ఆదివారం నాడు ‘టైగర్ 3’సినిమాని రిలీజ్ చేయబోతోన్నారు. నవంబర్ 12న ఉదయం ఏడు గంటలకు మొదటి షో పడిపోనుందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు.నవంబర్ 5 నుంచి ఇండియాలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయని నిర్మాతలు ప్రకటించారు. స్పాయిలర్స్‌ను కట్టడి చేసేందుకు ఏడు గంటలకు షోను వేయమని అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఏక్ థా టైగర్, టైగర్ హై జిందా, వార్, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న ఐదో చిత్రమే ఈ టైగర్ 3.  ఈ చిత్రాన్ని మనీష్ శర్మ తెరకెక్కించాడు.మల్టీప్లెక్సుల్లోని అన్ని ఫార్మాట్లలో ఈ చిత్రం రానుంది. 2డీ, ఐమాక్స్ 2డీ, 4డీఎక్స్ 2డీ, పీవీఆర్ ఎక్స్ఎల్, డీబాక్స్, ఐసీఈ, 4డీఈ మోషన్ ఇలా అన్ని ఫార్మాట్లలో రానుంది.
వైఆర్ఎఫ్ యూనివర్స్‌లో భాగంగా రాబోతోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. హిందీ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో రాబోతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్