Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు–మంత్రి  పొన్నం ప్రభాకర్

- Advertisement -

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు–మంత్రి  పొన్నం ప్రభాకర్

Strong measures to control road accidents--Minister Ponnam Prabhakar

కరీంనగర్
రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి
జిల్లా హెడ్ క్వార్టర్ లో పిల్లలచే రొడ్డు భద్రతా ప్రమాణాల పై భారీ ర్యాలీ.
గురుకులాలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత పై తనిఖీలు నిర్వహించాలి
రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవం విజయవంతంగా నిర్వహించాలని  రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు.
శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
రోడ్డు భద్రత ప్రమాణాలపై వేడుకలు ప్రతి గ్రామంలో జరగాలన్నారు.  రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులతో ప్రతి జిల్లా, మండలలో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు.
ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలన్నారు.  రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రొడ్డు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు.
భారీ తుఫాన్లు, వరదలు, రోగాలతో చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారని. ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై విద్యార్థులకు అవగాహన పెంచేందుకు సిలబస్ లో కూడా ప్రవేశ పెట్టేలా చూస్తామని అన్నారు.
రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.
రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు  రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  పిల్లలకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు , ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహర సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని, నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.
రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ. జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో  జరిగే రొడ్డు ప్రమాదాలలో 75%  డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు.  రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు.
రోడ్ల పై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని, దిని పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు.
రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్  హాల్ నుండి కలెక్టర్ మాట్లాడుతూ.
రోడ్డు భద్రతపై అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 82 బ్లాక్  స్పాట్స్  గుర్తించామన్నారు. ఇప్పటివరకు 68 బ్లాక్ స్పాట్లను సరి చేశామని.. మిగిలిన 14 బ్లాక్ స్పాట్స్ కు కూడా మరమ్మత్తులు చేస్తామని పేర్కొన్నారు.
జిల్లాలో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లాలకు వెళ్లి రోడ్లపై ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
హెల్మెట్ ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి కారణాలతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని వీటి నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ఈ నెలలో పాఠశాలల్లోనూ రోడ్డు భద్రతపై సాంస్కృతిక కార్యక్రమాలు
ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో తరచుగా ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుంచి  జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, ప్రపుల్ దేశాయ్, ఇన్చార్జి డీఆర్ఓ పవన్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, ఆర్టీసీ ఆర్ఎం పి.రాజు, డీఈఓ జనార్దన్ రావు, డిప్యూటీ రవాణా అధికారి, పి.పురుషోత్తం, ఎస్ఈ బి.లక్ష్మణ్ ఆర్అండ్ బీ , డీసీఓలు పి.సరిత, జగన్నాథం,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్