Saturday, February 8, 2025

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి          

- Advertisement -

సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి          

The demands of senior citizens should be addressed

రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

జగిత్యాల,
కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సీనియర్ సిటీజేన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో  బుధవారం జిల్లా కార్యాలయంలో    సమావేశమైన అనంతరం  రాష్ట్ర  అసోసియేషన్ అధ్యక్షుడు పి.నర్సింహారావు  పిలుపు మేరకు జిల్లా ,డివిజన్,మండల  ప్రతినిధులు   ప్రధాన పోస్టు ఆఫీసుకు సైకిల్లపై వెళ్లి   తమ డిమాండ్లను పోస్టు కార్డులపై రాసి ప్రధాన మంత్రి మోదీకి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు  పోస్ట్ బాక్సులో పోస్టు కార్డులు వేశారు.ఈ సందర్భంగా  హరి ఆశోక్ కుమార్  మాట్లాడారు.తెలంగాణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన  తమ డిమాండ్లను ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు పరిష్కరించాలని కోరారు..సీనియర్ సిటీజేన్స్ కోసం  ప్రత్యేక సంక్షేమ శాఖ కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు.వృద్ధుల సమావేశ భవనం కోసం హైదరాబాద్ లో2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి,భవన నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని ,ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,అన్నీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలన్నారు.అన్ని మున్సిపాలిటీల్లో వృద్ధుల కోసం వృద్దాశ్రమాలు, సమీకృత డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పంపిన పోస్టు కార్డుల్లో కోరారు.పెన్షనర్ల కు ఆదాయపు పన్ను రద్దు చేయాలని,రైల్వే ఛార్జీల్లో సీనియర్ సిటీజేన్స్ కు ఆపివేసిన రాయితీలు పునరుద్ధరించాలని, తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ సంక్షేమ చట్టము 2007 లో ప్రతిపాదించిన సవరణ బిల్లు 2019 ని  కేంద్రం పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప జేయాలని  ప్రధాన మంత్రి మోదీని  పోస్టు కార్డుల్లో  కోరారు.                         ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,జగిత్యాల పట్టణ అధ్యక్షుడు పి.సతీష్ రాజ్,కార్యదర్శి మానాల కిషన్,నాయకులు సింగం గంగాధర్,ఎం డి.ఇక్బాల్,సయ్యద్ యూసుఫ్,భీమయ్య,నారాయణ,దేవేందర్ రావు, ఇంద్రయ్య, కరుణ,విజయ లక్ష్మి,జిల్లా,డివిజన్ల, మండలాల ,గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్