- Advertisement -
వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయాలి
Vemulawada temple should be developed
వేములవాడ
మరో 100 ఏళ్ళు మనగలిగే విధంగా వేములవాడ దేవాలయాన్ని తీర్చి దిద్దాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. వేములవాడ ఆలయంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ టూ వీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలి. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. దేవాలయ ప్రాశస్త్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి. వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలి. అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులతో పాటు, సిఎస్ఆర్, దాతల విరాళాలు సేకరించాలి. బిల్వ వనాన్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దాలని అన్నారు.
- Advertisement -



