- Advertisement -
జగిత్యాల: జగిత్యాల నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తాను ఓడిపోతే బ్రతనీయరని డా బొగ శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ ఆడబిడ్డకు ఓటేసి గెలిపించాలని కొంగు పట్టి అభ్యర్థిస్తున్నానన్నారు. తనను గెలిపిస్తే నియోజక వర్గాన్ని సిరిసిల్ల, సిద్ధిపేట లకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.
- Advertisement -



