- Advertisement -

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ మండలం జలాల్ పూర్ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ నీట మునిగింది. పలు కాలనీలను వరద ముంచెత్తింది. వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గండి పడింది. ప్రధాన రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. ఆర్ముర్ జగిత్యాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కమ్మర్ పల్లి ఉప్పులూర్ మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
- Advertisement -