Monday, May 18, 2026

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామ

- Advertisement -

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామ

Allu Arjun uncle to Congress

హైదరాబాద్, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మరో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో ఐకాన్

స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా.. వీరిద్దరి భేటీలో ఏ ఏ అంశాల గురించి చర్చించారన్నది ఇప్పుడు సర్వత్రా

ఉత్కంఠను రేకెత్తిస్తోంది.అయితే.. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి.. టికెట్ ఆశించిన భంగపడ్డారు. అనంతరం.. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన సుమారు రెండు నెలల తర్వాత కాంగ్రెస్

కండువా కప్పుకున్నారు. అయితే.. హస్తం తీర్థం పుచ్చుకుని దాదాపు ఏడాది గడుస్తున్న వేళ.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో చంద్రశేఖర్ రెడ్డి భేటీ కావటం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. అల్లు

అర్జున్ అరెస్టు వ్యవహారం తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఓమారు గాంధీభవన్‌కు వెళ్లగా.. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.అల్లుడు అల్లు అర్జున్ విషయం గరించి ఏమైనా

మాట్లాడారా.. లేకపోతే రాజకీయ విషయాలు ఏమైనా చర్చించారా అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ సయయంలో డిసెంబర్ 24న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లగా.. ఆ

వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ నిరాకరించడంతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీనిపై.. స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం.. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌

జరుగుతుండగా చంద్రశేఖర్ రెడ్డి వచ్చారని తెలిపారు. ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని.. మళ్లీ వచ్చి తనను కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్‌ చెప్పుకొచ్చారు.అయితే.. అల్లు అర్జున్

మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడేనని, కాంగ్రెస్ వాది కూడా అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతానని.. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్

గౌడ్‌ తెలిపారు. మళ్లీ ఇన్ని రోజులకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి మహేష్ కుమార్ గౌడ్‌ను కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్