Tuesday, March 10, 2026

వైసీపీకి టీడీపీకి ఏంటీ తేడా  

- Advertisement -

వైసీపీకి టీడీపీకి ఏంటీ తేడా  

What is the difference between YCP and TDP?

వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ
విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి, ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కారని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల ఆరోపించారు. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో, మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు.  సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”.  కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్.  విద్యుత్ ఛార్జీల విషయంలో.. ” వైసీపీ చేసింది పాపం అయితే – రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం”.   గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ?  ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ?  5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా?  వైసీపీకి మీకు ఏంటి తేడా ?  వైసీపీ   తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచిందని,  కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.  ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే,  తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే..  వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి.  పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండి.  ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని , కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది.  ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో,  అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్