జోగిపేటకు చేరుకున్న బిజెపి విజయ సంకల్పయాత్ర
సంగారెడ్డి
బీజేపీ నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్ర జోగిపేటకు చేరుకుంది. యాత్రలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమ పల్గోన్నారు.
రుద్రమ మాట్లాడుతూ రాబోయే లోక సభ ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిచి బిజెపి పార్టీ జెండాను ఎగరవేస్తాం. మహిళలకు అవకాశం ఇస్తే ఎక్కడైనా విజయం సాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్మీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించలేదు. బిజెపి ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్ని రంగాలల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నది ఒక నరేంద్ర మోడీ మాత్రమే. దేశంలో 1200 కోట్ల మరుగుదొడ్లను పేదలకు కట్టించి అందించిన ఘనత నరేంద్ర మోడీదే. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశ ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్న ఘనత నరేంద్ర మోడీది. అప్పటి బిజెపి పార్టీ ఎంపీ అలే నరేంద్ర, సింగూరు జలాల కోసం పోరాడి ఈ ప్రాంత ప్రజలకు సింగూరు జలాలను అందించారు. తెలంగాణకు రెండు లక్షల ఇళ్లను ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ మంజూరు చేస్తే ఆ డబ్బులను దోచుకున్న దొంగ కెసిఆర్. దేశంలో, రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఏ పార్టీ పోటీ కాదని అన్నారు.
జోగిపేటకు చేరుకున్న బిజెపి విజయ సంకల్పయాత్ర
- Advertisement -