Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం

- Advertisement -

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం
-బూత్ లెవెల్ కార్యకర్తల స్థాయి సమావేశంలో దానం నాగేందర్
హైదరాబాద్
కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమాజిగూడ లోని జయ గార్డెన్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రోహిన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్, కార్పొరేటర్ సంగీత తదితర హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్వేషపూరిత రాజకీయాలతో లబ్ధి పొందాలనుకునే వారికి బుద్ధి చెప్పాలని కోరారు. అన్ని మతాలవారు వారి ఇష్టదైవాలను ప్రార్థన చేసుకుంటూ అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. దేశంలో అద్భుత సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!