Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మల్కాజ్ గిరిలో నువ్వు గెలుస్తావ్

- Advertisement -

మల్కాజ్ గిరిలో నువ్వు గెలుస్తావ్
హైదరాబాద్, ఏప్రిల్ 26
బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ నోరు జారి లేదా తనదైన శైలిలో కామెంట్లు చేసి హైలైట్ అయ్యే ఆయన తాజాగా మరోసారి కూడా అలాగే వ్యవహరించారు. ఈసారి పార్టీ లైన్ దాటి వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అభ్యర్థిగా ఈటల రాజెందర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఒక ఫంక్షన్ లో ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. అదే ఫంక్షన్ కు మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. అలా ఆ ఫంక్షన్ లో మల్లారెడ్డి, ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ఆప్యాయంగా ఒకరితో మరొకరు ఫోటో దిగారు. అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు.. మల్లారెడ్డి. మల్కాజ్ గిరిలో ఈసారి నువ్వే గెలుస్తున్నవ్ అన్నా.. అంటూ మాట్లాడారు. ‘‘మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్’’ అంటూ ఈటల రాజేందర్ ను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసినట్లు అయింది. ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు కోసం బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి రోడ్ షోల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ అత్యధిక ఓట్లు సాధించుకోవడం కోసం కష్టపడుతుంటే.. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈటల రాజేందర్ తో ఇలా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని స్వయంగా మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.
అన్నా నువ్వే గెలుస్తున్నావ్!
ఈటలతో మాజీ మంత్రి మల్లారెడ్డి

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!