- Advertisement -
హైదరాబాద్: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. గురువారం ఉదయం 11 గంటలలోపు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది.