- Advertisement -
కొండగట్టు ప్రాంతంలో తాటి, ఈత చెట్లు దగ్ధం
Apr 17, 2024,
కొండగట్టు ప్రాంతంలో తాటి, ఈత చెట్లు దగ్ధం
మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 300 తాటి చెట్లు, 500 ఈత చెట్లు దగ్ధం అయ్యాయి. జగిత్యాల అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియలేదు. తాటి ఈత చెట్లు దగ్ధం అవ్వడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని స్థానిక గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.